29.6 C
India
Sunday, April 20, 2025
More

    Malli karjuna Kharge పై 100 కోట్ల పరువునష్టం దావా.. సమన్లు జారీ చేసిన కోర్టు..

    Date:

    Malli karjuna Kharge
    Malli karjuna Kharge

    Malli karjuna Kharge : ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. బజరంగ్ దళ్ వివాదంలో ఆయనపై దాఖలైన రూ. 100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫేస్టోలోని అంశమే ఇందుకు కారణమైందని తెలుస్తోంది.

    అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ సంస్థలపై నిషేదం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై హిందూ సంఘం నేత ఒకరు పరువునష్టం దావా వేశారు. దీనికి సంబంధించి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ విషయంపై ఎన్నికల సమయంలో విమర్శలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తన మాటలను వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత బజరంగ్ దళ్ ను నిషేదించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

    ఇటీవల కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక విజయాన్ని కైవసం చేసుకుంది. 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 135 చోట్ల హస్తం జెండా పాతింది. ఇక బీజేపీ 66 సీట్లతో రెండో స్థానానికి పరిమితమవగా.. స్థానిక పార్టీ జేడీఎస్ 19 చోట్ల విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. మేనిఫెస్టోలో పెట్టినా.. ప్రసంగాల ద్వారా వెల్లడించినా తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తే హిందూ సమాజం ఓట్లు పడవని భావించి వెనుకకు తీసుకున్నట్లు అనేక వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా బజరంగ్ దళ్ ను విమర్శించినందుకే ఈ సమన్లు జారీ అయినట్లు  తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...

    Revanth Reddy Fires : హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్‌ మీడియా పోస్టులపై రేవంత్ రెడ్డి ఫైర్

    Revanth Reddy Fires : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో...

    Congress : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో.. గుండు సున్నా కొట్టిన హస్తం పార్టీ

    Delhi Congress : ఢిల్లీలో కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితమైంది....