16.3 C
India
Sunday, December 7, 2025
More

    Malli karjuna Kharge పై 100 కోట్ల పరువునష్టం దావా.. సమన్లు జారీ చేసిన కోర్టు..

    Date:

    Malli karjuna Kharge
    Malli karjuna Kharge

    Malli karjuna Kharge : ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. బజరంగ్ దళ్ వివాదంలో ఆయనపై దాఖలైన రూ. 100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫేస్టోలోని అంశమే ఇందుకు కారణమైందని తెలుస్తోంది.

    అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ సంస్థలపై నిషేదం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై హిందూ సంఘం నేత ఒకరు పరువునష్టం దావా వేశారు. దీనికి సంబంధించి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ విషయంపై ఎన్నికల సమయంలో విమర్శలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తన మాటలను వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత బజరంగ్ దళ్ ను నిషేదించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

    ఇటీవల కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక విజయాన్ని కైవసం చేసుకుంది. 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 135 చోట్ల హస్తం జెండా పాతింది. ఇక బీజేపీ 66 సీట్లతో రెండో స్థానానికి పరిమితమవగా.. స్థానిక పార్టీ జేడీఎస్ 19 చోట్ల విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. మేనిఫెస్టోలో పెట్టినా.. ప్రసంగాల ద్వారా వెల్లడించినా తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తే హిందూ సమాజం ఓట్లు పడవని భావించి వెనుకకు తీసుకున్నట్లు అనేక వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా బజరంగ్ దళ్ ను విమర్శించినందుకే ఈ సమన్లు జారీ అయినట్లు  తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...