సొగసరిగా పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వేడి పెంచుతుంది. ఇదే కాదు ఆమె పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. మనసులో ఏమున్నా స్వేచ్ఛగా జంకకంటా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఒక సన్నివేశంలో అనే తిట్టు మాదర్.. దీనిపై బాగా విరుచుకుపడ్డారు అనసూయ. ఇంకా ఈ సినిమాలోని చాలా సన్నివేశాలపై ఆమె తనదైన స్టయిల్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను తిట్టడం, కొట్టడం అస్సలు బాగాలేదని చెప్పారు. దీనికి తోడు లిప్ కిస్సులపై కూడా ఘాటుగా స్పందించారు.
అదే అర్జున్ దేవరకొండ నటించిన సినిమా లైగర్ డిజాస్టర్ కావడంతో అర్జున్ రెడ్డి గాయాలను ఆమె తవ్వారు. దీంతో ఆమె విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. ఇక అమ్మడు వేసుకునే బట్టలపై కామెంట్ చేస్తే అస్సలు నచ్చదట. ‘నాకు ఏవి కంఫర్ట్ అనిపిస్తే అవ్వే వేసుకుంటా.. ఇందులో వారికి అభ్యంతరం ఏంటి..? అంటూ ప్రశ్నించింది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావును కూడా ఆమె వదలలేదు. సీనియర్ అని చూడకుండా దారుణమైన కామెంట్లు చేసింది అనసూయ.
రీసెంట్ గా ఆమె హీరోయిన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. హీరోల డామినేషన్ పై అనసూయ స్పందించినట్లు తెలుస్తోంది. ‘ప్రతీ డైరెక్టర్ హీరోను ఐకాన్ గా తీసుకొనే సినిమాలు తీస్తున్నారు. హీరోయిన్స్ ను కేవలం రొమాన్స్ కోసమే వాడుకుంటున్నారు. హీరో, హీరోయిన్ పాత్రలపై ఇంత వ్యత్యాసం ఉండద్దు. హీరోలు గిల్లితే హీరోయిన్లు గిల్లించుకోవాలి తప్ప మాట్లాడవద్దు’ దీనికి మించి హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత కనిపించడం లేదు’. అంటూ అసహనం వ్యక్తం చేసింది అనసూయ.
ఈ కామెంట్లపై టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇన్ని మాటలు అన్న అనసూయ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించలేదా.. క్షణం, దర్జా, వాంటెడ్ పండుగాడు లాంటి వాటిలో లీడ్ రోల్ లేదా అంటూ కొందరు బాహాటంగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మెయిల్ డామినేషన్ ను సహించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ ‘విమానం’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక పుష్ప2లో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది.