
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ పై కర్ణాటకలో దాడి జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ దాడిలో కైలాష్ కు ఎలాంటి గాయాలు కాలేదు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన వివరాలలోకి వెళితే ……. కర్ణాటకలో హంపి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. జనవరి 26 నుండి 29 వరకు జరిగాయి. అందులో భాగంగా నిన్న ఈ ఉత్సవాలలో సింగర్ కైలాష్ ఖేర్ కూడా పాల్గొన్నాడు.
పలు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ ని ఆలపించాడు కైలాష్ ఖేర్. అయితే ఓ ఇద్దరు యువకులు కైలాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీళ్ల బాటిల్స్ ను బలంగా విసిరి కొట్టారు. కైలాష్ మీద ఆ బాటిల్స్ పడలేదు కాకపోతే కాళ్ళ దగ్గర పడ్డాయి. దాంతో కలకలం చెలరేగింది. తనపై ఇద్దరు యువకులు వాటర్ బాటిల్స్ విసిరినప్పటికీ అదేది పట్టించుకోకుండా పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించాడు. అయితే కైలాష్ ఖేర్ పై వాటర్ బాటిల్స్ విసిరిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలా చేసారని ప్రశ్నిస్తే …… అన్నీ హిందీ పాటలే పాడుతున్నాడు. కన్నడ పాటలు పాడడా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.