
Etala Rajender Delhi Tour : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈక్రమంలోనే ఆయన హుటాహుటిన హస్తినకు వెళ్లినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పార్టీలో గ్రూపు రాజకీయాలను రూపుమాపేందుకే అధిష్టానం ఈటలను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.






