
Blood Donor Day : మనిషి బాడీలో ప్రధాన భూమిక పోషించేది రక్తమే.. అవయవాలకు ఆక్సీజన్ అందించాలన్నా.. వాటి నుంచి మలినాలను సంబంధిత అవయవాలకు చేర్చాలన్నా బ్లడ్ పాత్రనే మెయిన్. ఇంతటి ప్రాముఖ్యమున్న రక్తాన్ని మాత్రం కృత్రిమంగా సృష్టించడం కష్టమే. అందుకే ‘ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం’గా మారింది. యాక్సిడెంట్ అయినా.. ఆపరేషన్ అయినా.. రక్తం తప్పనిసరిగా అవసరం అవుతుందని తెలిసిందే. అందుకే ప్రధాన ఆర్గనైజేషన్స్ రక్తదానంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాయి.
ఎంతటి ఆర్గనైజేషన్ అయినా అందులో రక్తదానాన్ని ఒక కార్యక్రమంగా తీసుకుంటుంది. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో రక్తం దొరకక చనిపోవడం వింటూనే ఉన్నాం. ఆ సమయంలో మరణించిన వ్యక్తితో ఒక కుటుంబం బాధ వర్ణణాతీతం. ఇంటి పెద్దనే మరణిస్తే ఇక రోడ్డున పడాల్సిందే. అలాంటి కుటుంబాలు కూడా లేకపోలేదు. గతంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు తక్కువగా ఉండేవి. కానీ క్రమ క్రమంగా అవి పెరుగుతూ వస్తున్నాయి. బ్లడ్ తీసుకొని స్టోర్ చేసి అవసరమైన వారికి అందజేస్తూ మానవతను చాటుకుంటున్నారు ఆయా స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ కామన్ గానే మారింది. దీన్ని గమనించిన జై స్వరాజ్య్ సంస్థల అధినేత జై యలమంచిలి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రక్తం కావాలనుకునే వారి కోసం ఒక యాప్ నిర్వహిస్తున్నారు. దాని పేరు ‘యూ బ్లడ్’. స్టోరేజ్ బ్లడ్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఫ్రెష్ బ్లడ్ అందించడం మరో ఎత్తు.. రక్తదాతలను వెతుక్కోవాలి, వారిని కలిసి, లేదా ఫోన్ లో మాట్లాడి వివరాలు తీసుకోవాలి, వారికి ఏ సమయం వీలుంటుందో కనుక్కొని రక్తదానం చేయాలని కోరాలి. వీటన్నింటికీ ఎక్కువ సమయం పడుతుండడంతో జై ఈ యాప్ రూపొందించారు.
ఈ యాప్ లో బ్లడ్ డోనర్స్ వివరాలు ఉంటాయి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అవలబుల్ గా ఉంటారో..? వారి అడ్రస్, ఫోన్ నంబర్స్ తదితరాలను ఇందులో పొందు పరిచారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ డొనేషన్ మరింత ఈజీగా మారింది. ఇప్పటి వరకు వందలాది మంది దీన్ని ఉపయోగిస్తూ తోటి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ యాప్ రూపొందించిన జైకి కూడా చాలా మంది కృతజ్ఞతలు చెప్తున్నారు. దీనిపై మరింత అవగాహనను పెంచేందుకు జై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులకు కూడా ఈ యాప్ గురించి వివరిస్తూ మరింత మందికి చేరేలా కృషి చేస్తున్నారు.






