ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప ది రూల్’.. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.. ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో అందరికి తెలుసు..ఈ సినిమా కథ పార్ట్ 1 తోనే పూర్తి అవ్వక పోవడంతో పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 2 లో చాలా మంది స్టార్స్ ను భాగం చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
తాజాగా పుష్ప 2 రిలీజ్ విషయంలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరగా ఈ సినిమా ఆడియో రైట్స్ గురించి వార్త బయటకు వచ్చింది. పుష్ప 2 ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టి సిరీస్ 65 కోట్ల భారీ ధరకు దక్కించున్నట్టు తెలుస్తుంది. ఇంత వరకు సౌత్ సినిమాకు ఈ రేంజ్ లో ఆడియో రైట్స్ అమ్ముడు పోలేదు..
ఆర్ఆర్ఆర్ సినిమాకు కేవలం 30 కోట్లకు మాత్రమే అమ్ముడవ్వగా ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకు డబుల్ ధరకు రైట్స్ కొనుగోలు అవ్వడం పుష్ప స్టామినా ఏంటో చెబుతుంది.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఈసారి ఏకంగా 20కి పైగానే దేశాల్లో రిలీజ్ చేయనున్నట్టు టాక్.. చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో..






