టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెలలో చంద్రబాబు విశాఖలో పర్యటించ నున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఉమ్మడి విశాఖ లో పెందుర్తి, అనకాపల్లిలో ఇదేం కర్మ మన రాష్టానికి అనే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచే జగన్ అవినీతి పాలనకు చరమగీతం పాదాలని పిలుపు నిచ్చారు.సీఎం జగన్మోహన్ రెడ్డి పాదం దరిద్రపు గొట్టు పాదం అనీ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్క అరిష్టం అనీ విమర్శలు చేశారు.
అమరావతిలో అడుగు పెట్టారు విజయవాడ, గుంటూరు సర్వ నాశనం అయ్యాయి అనీ అన్నారు. పంటకు చీడ పడితే ఎలా ఉంటుందో… రాష్టానికి పట్టిన చీడ పురుగు జగన్ అనీ ఆ చీడ పురుగు తొందరగా పంట పాడు కాకముందుకే చీడ పురుగు మందు కొట్టి పంటను కాపాడు కున్నట్టు రాష్టాన్ని కాపాడాలని అన్నారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన అంటున్న జగన్ ఆయన అడుగు పెడితే విశాఖ నాశనం అవుతుందన్నారు. సీఎం జగన్ కు విశాఖ పై ప్రేమ లేదని అక్కడ ఉన్న భూముల కోసం ఆయన విశాఖ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు.ఇచ్చాపురం భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆలోచన చేయాలని హెచ్చరించారు.
జనసేన, టీడీపీ పొత్తుల పై తమ అధినేత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకుంటారని అయన ఈ నిర్ణయం తీసుకున్న తమకు ఆమోదయోగ్యమే అన్నారు. డీఏస్పీ నియామకాల్లో రాజకీయం తాగదన్నారు. కాంగ్రెస్ లో ఒక వేలుగు వెలిగిన మంత్రి ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అన్నారు.