
Polavaram Today : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పోలవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పర్యవేక్షించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈమేరకు జగన్మోహన్ రెడ్డి ఉదయం 10గంటల సమయానికి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. పోలవరం చేరుకున్నాక ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు.






