Home BREAKING Minister Botsa : తప్పుచేశామని భావిస్తే మాకు ఓటు వేయొద్దు: మంత్రి బొత్స

Minister Botsa : తప్పుచేశామని భావిస్తే మాకు ఓటు వేయొద్దు: మంత్రి బొత్స

13

 

 

ఏపి: తప్పుచేశామని భావిస్తే మాకు  ఓటు వేయొద్దని ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశామన్న ధైర్యం మాకు ఉందని మంత్రి మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. తనకు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. అసెంబ్లీ బరిలో నాలుగోసారి ప్రజల ముందుకు వస్తున్నానని గతంలో నాపై ఎలాంటి ప్రేమను చూపించారో ఇప్పుుడు కూడా అదేవిధంగా నాపై మీ ప్రేమ చూపించి గతం కంటే ఎ క్కువ మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.  గడిచిన ఐదు ఏళ్లలో అనేక హామీలను అమలు చేసి రాష్ట్రంలో సంక్షేమ పాలన కోనసాగించామని మంత్రి తెలిపారు.  ఏ రాష్ట్రంలో ఇవ్వని సంక్షేమ కార్య క్రమా లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని మరోసారి ఆశీర్వ దించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..