30.7 C
India
Wednesday, February 18, 2026
More

    TDP comes : టీడీపీ వస్తే పేదల పట్టాలు రద్దవుతాయా.. ఇంతకీ ఎవరన్నారు?

    Date:

    TDP comes
    TDP comes, Chandra babu

    TDP comes : ఏపీలో రాజకీయం ఎప్పుడూ కొంత గందరగోళంగానే ఉంటుంది. టీడీపీ, వైసీపీలు ఇక్కడ పోటాపోటీ రాజకీయాలు చేస్తుంటాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. చివరకు టీడీపీ కి పేరు వస్తుందని రాజధాని అమరావతి ప్రాజెక్టును కూడా పక్కన పెట్టింది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయించింది. ప్రజావేదికను కూల్చివేసింది. ఇలా ఇక్కడి రాజకీయాలన్నీ కక్షపూరితంగానే ఉంటాయి. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అమరావతికి మద్దతు తెలిపి, నేడు అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరోవైపు ఎన్టీఆర్ పేరిట ఉన్న పలు సంస్థలు, పథకాల పేర్లను మార్పు చేయించారు.

    ఏపీలో ఇలాంటి రాజకీయం గతం నుంచి ఉన్నదే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమరావతి కోసం కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నది ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీకి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. టీడీపీ అధికారంలోకి వస్తే మరి పట్టాలను రద్దు చేస్తుందనే వాదన బయటకొచ్చింది.

    టీడీపీకి అనుకూలంగా పని చేసే ఓ మీడియా చానల్లో ప్రముఖ జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలు కలకలం రేపింది. ఇప్పుడు వైసీపీ చేస్తున్నదే.. రేపు టీడీపీ చేస్తుందనేది సదరు జర్నలిస్ట్ వాదన. అయితే దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ లేదు. పేదలకు ఇచ్చే పట్టాలను తామెందుకు రద్దు చేస్తామని మాత్రం ఒకరిద్దరు నేతలు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ చర్చ అనవసరమని మరికొందరు మాట్లాడుతున్నారు. పేదలకు పట్టాల రద్దు అని మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని టీడీపీ అధినేతకు తెలుసు. ఇది సున్నితమైన అంశం కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడరు. దీనిని అనవరసంగా సదరు టీడీపీ అనుకూల మీడియా చానల్ లో ఏదో చెప్పేసి వివాదాస్పదం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    ఇది టీడీపీ కి చేటు చేస్తుందని భావిస్తున్నారు పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం  అంటే ఇక పతనం అంచునకు చేరినట్లేనని చెబుతున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు టీడీపీ నేతలు తిరస్కరిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండడంతో, ఇప్పుడు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారంతా భావిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పుడు ఇస్తేనే తమకు ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భావిస్తున్నది. ఏదేమైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడడం సరికాదని, ఇది వైసీపీకి మేలు చేసేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరి పట్టాల అంశంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    CM Chandrababu : మూడేళ్లలో అమరావతి రూపు మారుస్తా: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : మూడేళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, అందుకోసం...

    Drone technology : డ్రోన్ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు

    Drone technology : డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని...