Neel Mohan : ఇండియా విశ్వగురువు అనే నానుడి రాను రాను నిజం అవుతుంది. ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా ఇండియా వ్యక్తులు, ఇండియా ప్రముఖులు దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచానికే దిక్సూచిగా ఇండియా నిలిచింది అనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నలంద, తక్షశిల విశ్వ విద్యాలయాలు ఉన్న సమయంలో ప్రపంచంలో ఎలాంటి ఘటన జరిగినా దానిపై ఇండియా సమగ్ర వివరణ ఇచ్చేదట. తర్వాత బ్రిటీష్ పాలన అణచివేత రాను రాను ఇండియా తన అస్థిత్వాన్ని కోల్పోతూ వచ్చింది.
టీమ్ లీడింగ్, ఆర్గనైజింగ్ అనే పదాలు ఇండియన్స్ బ్లడ్ లోనివే. ప్రపంచంలో చాలా మంది చదువుకునేందుకు నలంద, తక్షశిలకు వచ్చారంటే భారత్ ఆ సమయంలోనే ఏ మేరకు డెవలప్ అయ్యిందో ఊహకు కూడా అందదు. అప్పటి మాట అటుంచితే ఇప్పుడు ప్రపంచంలోని బడా సంస్థలు ఇండియాన్స్ చేతిలోనే ఉన్నాయి. అంటే ఒక కంపెనీని విజయశిఖరాలను తీసుకెళ్లడంలో ఇండియన్స్ ప్రతిభను ప్రపంచం ఇంకా మరిచిపోలేదనే చెప్పాలి.
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కు ఇండియన్ అందునా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుందర్ పిచాయ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. తర్వాత గూగుల్ మొత్తానికి ఆయనే సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు కూడా సత్యనాదెళ్ల సీఈఓగా ఎన్నికయ్యారు. ఐబీఎం, డిలైట్, నోవార్టిస్ట్, కాగ్నిజెంట్, ఫీడ్ ఎక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలకు మన ఇండియన్స్ సారధ్యం వహిస్తున్నారు. ఇందులో రీసెంట్ గా మరో కంపెనీ కూడా తోడైంది.
ప్రపంచంలోనే దిగ్గజ సంస్థ యూట్యూబ్ కు మన భారత మూలాలు ఉన్న వ్యక్తి నీల్ మోహన్ సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్నారు. మోహన్ 2015లో యూట్యూబ్ లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా చేరాడు. యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ ఎన్ఎఫ్ టీ లాంటి వారిని చూసుకునేవాడు. సింహ లాంటి కంటెంట్ ను యూట్యూబ్ నుంచి తొలగించేందుకు కూడా ఆయన కృషి చేశారు. ఆయన యూట్యూబ్ సీఈఓ కావడంతో ఇండియా అభినందనలు తెలుపుతుంది.