
సామాన్య ప్రజానీకానికి కేంద్రం ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నది. ఇదే గనక జరిగితే చాలా కుటుంబాలకు వరంగా మారనుంది. చిన్న మొత్తాల పొదుపు పథకంలో చేరే వారికి ఊరట కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే కొన్ని పథకాల వడ్డీ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈసారి మరో పథకం వడ్డీ రేట్లు పెంచేందుకు కసరత్తు చేస్తున్నది
అయితే గత ఏప్రిల్ ఒకటి నుంచి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీరేట్లు మోడీ ప్రభుత్వం పెంచింది. కానీ పీపీఎఫ్ పై మాత్రం వడ్డీ రేటు స్థిరంగానే కొనసాగించింది. ఈసారి పీపీఎఫ్ పై కూడా వడ్డీ రేటు పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జూలై 1 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.
2020 ఏప్రిల్ నుంచి పీపీఎఫ్ పై వడ్డీ రేటు స్థిరంగానే ఉంటూ వస్తుంది. అప్పుడు పీపీఎఫ్ వడ్డీ రేటు 7.9% నుంచి 7.1 శాతానికి తగ్గింది. ఇప్పుడు కూడా అదే ఉంటూ వస్తున్నది. చిన్న మొత్తాల పొదుపుపై పథకాలపై వడ్డీ రేట్లు పెరిగినా పీపీఎఫ్ పై మాత్రం పెరగలేదు అయితే ఈసారి అది పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈసారైనా ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందని డిపాజిట్ దారులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఏడాదిలో రూ. 1.50 లక్షల వరకు కన్ను ఆదా చేసుకోవచ్చు. పీపీఎఫ్ అనేది ఎలాంటి రిస్క్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో చాలామంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈసారి దీని వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని అంచనా వేసుకుంటున్నారు.
|
ReplyForward
|






