
జైస్వరాజ్య టీవీ అధినేత, యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి గారు నిన్న ప్రముఖ యోగాగురువు రామ్ దేవ్ బాబాను మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ జై యలమంచిలి గారు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందారు. రక్త కొరతతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకొని యూ బ్లడ్ యాప్ ను సృష్టించారు. ఇందులో రక్త దాతల పేర్లతో పాటు రక్త గ్రహీతల పేర్లు కూడా ఉంటాయి. ఈ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటుడు సోనుసూద్ వ్యవహరిస్తుున్నారు.
రామ్ దేవ్ బాబాను కలిసిన యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి గారు తమ సంస్థ యూ బ్లడ్ యాప్ చేపడుతున్నసేవ కార్యక్రమాలను రామ్ దేవ్ బాబాకు వివరించారు. ప్రాణాపాయం లో ఉన్నవారికి తమ సంస్థ ద్వారా బాధితులకు రక్తం అందజేస్తూ ఇప్పటివరకు ఎంతో మంది ప్రాణాలను యూ బ్లడ్ యాప్ నిలబెట్టిందని డాక్టర్ జై యలమంచిలి గారు రామ్ దేవ్ బాబాకు వివరించారు. ఈ యూ బ్లడ్ యాప్ కి సంబంధించిన పూర్తి వివరాలను రామ్ దేవ్ బాబా అడిగి తెలుసుకున్నారు.

అమెరికా లో స్థిరపడిన నేను , నా మాతృభూమి కి సేవ చేయడానికి భారత దేశం వచ్చానని రామ్ దేవ్ బాబాకు డాక్టర్ జై యలమంచిలి గారు తెలిపారు..
డాక్టర్ జై యలమంచిలి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫిదా అయిన రాందేవ్ బాబా, డాక్టర్ జై యలమంచిలి గారిని అభినందించారు… దేశం కోసం మీరు చేస్తున్న సేవలు మరువలేము అంటూ కొనియాడారు.. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన యూ బ్లడ్ యాప్ సేవలను కొనియాడారు. డాక్టర్ జైని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సేవలను మరింతగా విస్తృతం చేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయని, ఆపదలో ఉన్నవారికి యూ బ్లడ్ యాప్ ప్రాణాన్ని నిలుపుతుందన్నారు. ప్రతి ఒక్కరు యూ బ్లడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు, రానున్న రోజుల్లో మరింత మందికి మంచి సేవలు అందించి, ప్రజల నుంచి ప్రశంసలు పొందాలని డాక్టర్ జై యలమంచిలి గారిని దీవించారు. రాందేవ్ బాబా తనను ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని డాక్టర్ జై యలమంచిలి తెలిపారు.
