శక పురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో యూ బ్లడ్ ఫౌండర్ జై యలమంచిలి టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అందరినీ పలకరిస్తూ సందడి చేశారు. జైతో మాట్లాడేందుకు నాయకులు ఉత్సాహం చూపించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జై యలిమంచిలిని కలిసి మాట్లాడారు.
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో చాలా సేపు ముచ్చటించారు జై యలమంచిలి. మహానాడుకు సంబంధించిన చాలా విషయాలను వారు మాట్లాడుకున్నారు. నందమూరి తారక రామారావు చేసిన సినిమాలతో పాటు శక పురుషుడిగా కీర్తి గడించేంత వరకు ఆయన పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఇంకా టీడీపీ పార్టీ మున్ముందు చేపట్టే కార్యక్రమాలు, ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపైనా జై యలమంచిలి వంగలపూడి అనితను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలని అదిశగా చేపట్టాల్సిన విషయాలను పిచ్చాపాటిగా మాట్లాడారు జై.
వంగలపూడి అనిత కూడా జైతో పార్టీ కార్యక్రమాలు, తదితర విషయాలను పంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీ యువరాజు నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రపై కూడా వారు కాసేపు ముచ్చటించుకున్నట్లు తెలిసింది. సక్సెస్ అయినట్లే అని వంగలపూడి అనిత చెప్పగా ఎన్నికల వరకు మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలని జై కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలిసింది.
జై స్థాపించిన ‘యూ బ్లడ్’ ఆర్గనైజేషన్ పై వంగలపూడి మాట్లాడారు. ఈ ఆర్గనైజేషన్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ ఆలోచన వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు అనిత. మరిన్ని సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె ఆయనకు సూచించారు. ఆర్గనైజేషన్ కు వ్యక్తిగతంగానూ.. టీడీపీ నుంచి గానీ తప్పకుండా సహాయ సహకారాలు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు.