34.1 C
India
Friday, March 29, 2024
More

    Japan : మరికాసేపట్లో జపాన్ కు చేరుకోనున్న మోదీ

    Date:

    • ప్రపంచ అగ్రనేతలతో సమావేశం
    Japan
    Japan, modi

    Japan : ప్రధాని నరేంద్ర మోదీ జీ 7 సదస్సు కోసం జపాన్ కు శుక్రవారం బయలుదేరారు. మరికాసేపట్లో ఆయనను అక్కడికి చేరుకోనున్నారు. హిరోషిమా లో జరిగే ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రయాణానికి ముందు మోదీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. పలు అంతర్జాతీయ సమస్యల పై ఆయన ప్రపంచ స్థాయి నేతలతో చర్చించనున్నారు.

    ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాలకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణు దాడిని ఎదుర్కొన్న హిరోషిమాలో కూడా ఆయన పర్యటించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని అణు భూమిలో ఆవిష్కరించడం చారిత్రక ఘట్టంగా అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం జపాన్ ప్రధాని కిషిద స్వగ్రామం కూడా హిరోషిమా కావడం ఇక్కడ గమనార్హం.

    రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా అమెరికా వేసిన అణుదాడికి గురైంది. ఇప్పటికీ హిరోషిమాలో ఆ దాడి ప్రభావం కొనసాగుతున్నది. ఆ ఘటనలో వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాటి దాడిని ప్రపంచమంతా ఖండించింది. ప్రస్తుతం మోదీ పర్యటన నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పర్యటనకు ముందు చేసిన ట్వీట్ లో పలు అంతర్జాతీయ సమస్యలపై ప్రపంచ నేతలతో చర్చించబోతున్నానని, ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా చాలా రోజల తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటనకు వెళ్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే మోదీకి ఆదరణ పెరుగుతున్నదనే వార్తల నేపథ్యంలో ఈ పర్యటన మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

    Share post:

    More like this
    Related

    Second Marriages : సిద్ధార్థ్ కాకుండా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న వారు ఎంతమందంటే?

    Second Marriages : ఇండస్ట్రీలో రెండో పెళ్లి కామన్. ఇక్కడ చాలా...

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Devineni Avinash : మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Devineni Avinash : కృష్ణలంక 20,21వ డివిజన్ల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన...

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...

    Odisha News : నిన్నటి వరకు ఉత్కంఠ.. నేడు ఎవరికి వారేనంట..

    Odisha News : మరోసారి కలిసి పోటీ చేయాలని భావించిన బిజద, భాజపాలు...

    Kunamneni : బెదిరింపులకు లొంగకపోవడంతోనే  అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.. కూనంనేని

    Kunamneni  : దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి బిజెపి...