
Peddireddy Counter : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురంలోని అలమూరు వద్ద ఏర్పాటు చేసిన అమ్మ డైయిరీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా శక్తిహీనుడిగా అయ్యారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని చూస్తుందన్నారు. అయినప్పటికీ వైసీపీ ఒంటిరిగానే ఆ పార్టీలను ఎదుర్కొని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






