బ్రేకింగ్ న్యూస్…… కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు. దొంగల ఇంటి పేర్లు అన్ని కూడా మోడీ పేరుతోనే ఉన్నాయని , నీరవ్ మోడీ , లలిత్ మోడీ అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరు కూడా మోడీనే అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దాంతో రాహుల్ వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదైంది. కాగా ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. దీంతో రాహుల్ గాంధీని శిక్షించాలని భావించిన కోర్టు గరిష్టంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking News