RK Kotha Paluku: మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సమయం దొరికినప్పుడల్లా జగన్ ను పై తన ఛానల్, పత్రిక ద్వారా విమర్శిస్తూనే ఉంటాడు. వైఎస్ జగన్ అతని సోదరీ వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. జగన్ షర్మిలకు ఆస్తి ఇవ్వాలని లేకుండా ఏపీ బ్రదర్ అనిల్ జగన్ వ్యతిరేఖంగా క్రైస్తవులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పకనే చెప్పారు.
ఆర్కే కొత్త పలుకులో రాసిన వ్యాసం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. జగన్, షర్మిల రాజకీయ పరంగా విభేదించి గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. వారిద్దరి మధ్య విబేధాలకు రాజకీయ పరమైన విషయాలు కాకుండా ఆస్తి విషయం కూడా కారణమైందని తెలుస్తుంది. గతంలో ఓపెన్ హార్ట్ విత్ లో షోలో పాల్గొన్న షర్మిల అస్తుల పంపకాలు జరిగాయా అని రాధాకృష్ణ అడిగితే అస్తి ఎక్కడికి పోతుంది అదే వస్తుంది అని సుతిమెత్తంగా సమాధానమిచ్చారు.
ఆర్కే కొత్త పలుకు ద్వారా సీఎం జగన్ బహిరంగ రాయబారం పంపించారు. అస్తులు మీరు పంచి ఇస్తారా.. లేక మీకు వ్యతిరేఖంగా ఏపీలో క్రైస్తవులను మార్చేందుకు ప్రయత్నించ మంటారా అని సంకేతం ఈ వారం కొత్త పలుకు సారాంశం.అయితే ఈ ప్రతిపాదన తాను చేయడం లేదని మీ చెల్లెలు నుంచే వస్తుందని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.
గతంలో వీరిద్దరి మధ్య ఆస్తుల పంపకాల విషయాలు ఒక కొలిక్కి వచ్చాయని సరస్వతి సిమెంట్ కంపెనీతో పాటు చాలా ఆస్తులను ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నారని సంతకం కూడా చేసి ఇచ్చారని, ఏమైందో మళ్లీ ఆస్తులు ఇవ్వలేదని ఆ విషయంలో షర్మిల, విజయమ్మ కోపంగా ఉన్నారని చెప్పారు. బ్రదర్ అనిల్ దింపు క్రైస్తవుల్లో జగన్ వ్యతిరేఖంగా ప్రచారం చేయించాలని భావిస్తున్నారట. అయితే విషయం గ్రహించిన జగన్ ఎన్నికలు కాగానే ఆస్తులు పంపిణీ చేస్తానని రాయబారం పంపారట.. అయితే జగన్ నైజం తెలిసిన షర్మిల ముందు అస్తులను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఆర్కే మాత్రం ఒక స్ట్రాంగ్ సందేశం పంపారు.