35.9 C
India
Monday, May 12, 2025
More

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Date:

    Ladakh
    Ladakh

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్ కు 148 కి.మీ. దూరంలోని బోధి నదిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    సైనిక విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో ఉధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

    దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related