
key judgment on Delhi : దేశ రాజధాని ఢిల్లీపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇన్నాళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ర్ట ప్రభుత్వ అధికారాలపై కొనసాగుతున్న వివాదానికి ఓ పులిస్టాప్ పడినట్లయ్యింది. ఈ తీర్పు కేంద్రానికి కూడా అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. తీర్సు నేపథ్యంలో ఆప్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇంతకీ సుప్రీం ఏం చెప్పిందంటే..
ఢిల్లీ దేశ రాజధాని. ఇన్నాళ్లు కేంద్రం హోంశాఖ ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడి పాలనలో తనదైన మార్క్ చూపేవారు. ఈ అంశంపై రాష్ర్ట ప్రభుత్వానితో కొన్ని సార్లు విభేదాలు ఎదురయ్యేవి. దీంతో సుప్రీంలో తేల్చుకునేందుకు ఇటు కేంద్రం, అటు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమయ్యాయి. కాగా, సుప్రీం తీర్పునిస్తూ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వానికే అంతిమ అధికారం ఉంటుందని వెల్లడించింది. లేకుంటే అధికారుల్లో జవాబుదారీతనం కొరవడుతుందని అందులో పేర్కొంది. ఢిల్లీని మిగతా రాష్ర్టాల మాదిరిగానే భావించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర అధికారాలను కొనసాగించడం సరికాదని పేర్కొంది. మొత్తానికి ఈ తీర్పు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు పెద్ద విజయమే అనుకోవచ్చు. కేంద్రం ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్లతో అనేక సందర్భాల్లో రాష్ర్ట ప్రభుత్వాలకు వివాదాలు ఏర్పడుతున్నాయి. అధికారం మాదంటే.. మాదని ఇద్దరూ విభేదాలకు తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఈ సమస్యకు ఇక చెక్ చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీపై పట్టు కోసం
ఢిల్లీపై పట్టుకోసం బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నది. కేజీవ్రాల్ సర్కారును అనేక రకాలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. రాష్ర్ట సర్కారు తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడ్డుకోవడం అనేక సందర్భాల్లో వివాదాలకు కారణమైంది. ఇక రాష్ర్ట ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయనే సుప్రీం తాజా తీర్పుతో ఇప్పటికైనా ఈ విభేదాలకు చెక్ పడుతుందని అంతా అనుకుంటున్నారు.






