
AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు. సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరుగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్ కు వివరించనున్నారు.
ఈ సందర్భంగా సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనున్నారు. థియేటర్ల సమస్యలపైనా ఈ సందర్భంగా చర్చించనున్నారు. నిర్మాతలు అశ్వనీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ తదితరులు పవన్ ను కలువనున్నారు.