38.7 C
India
Thursday, June 1, 2023
More

    Politics of Karnataka : అది చెరి సగమేనట.. తేలిన కర్ణాటక రాజకీయం

    Date:

    • నేడు ప్రకటన, 20న ప్రమాణస్వీకారం
    Politics of Karnataka
    Politics of Karnataka, sidda ramaiah, dk shivakumar

    Politics of Karnataka : కర్ణాటక సీఎం పీఠం పీటముడి వీడింది.  మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు రోజల ఉత్కంఠకు తెరిదించుతూ మరికొన్ని గంటల్లోనే కీలక ప్రకటన వెలువడనుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరూ పట్టువీడక పోవడంతో హైకమాండ్ తీవ్రం ఆందోళనలోకి వెళ్లింది.

    అయితే పార్టీ అధిష్టానం బుధవారం అర్ధరాత్రి వరకు ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపింది. సిద్ధరామయ్య, డీకేలకు చెరి రెండున్నరేళ్లు అధికారం పంచేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మరికాసేపట్లో  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటించనున్నారు. అయితే ఈనెల 20న కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఈరోజు సిద్ధరామయ్య, డీకేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తున్నది. గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా వీరిద్దరూ కలుసుకోలేదు. సిద్ధ రామయ్య పేరు ఖరారైందని, ఆయనకు ప్రోటోకాల్ కూడా ఇచ్చారని బుధవారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని వదంతులేనని పార్టీ అధిష్ఠానం కొట్టి పడేసింది.

    కాగా, బెంగళూరులో ఈ రోజు ఎమ్మెల్యేలతో ఏఐసీసీ నాయకులు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలు, ప్రభుత్వం ఏర్పాటు పై చర్చించనున్నారు. ఆరు రోజుల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుండగా, అధిష్టానం మంత్రి వర్గం వివరాలపై కూడా కసరత్తు చేస్తున్నది. డీకే శివకుమార్ ను ఈ మేరకు ఒప్పించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. రాహుల్ గాంధీ కూడా డీకే, సిద్ధరామయ్యలతో పలు మార్లు చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటన కోసం కర్ణాటక ఎదురు చూస్తున్నది.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    DK meet Sharmila : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో డీకే కీలక భేటీ..

    DK meet Sharmila : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్,...

    Rahul and Priyanka : కర్ణాటక చేరుకున్న రాహుల్, ప్రియాంక

    Rahul and Priyanka : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం...

    Karnataka new government : నేడు కర్ణాటకలో కీలక ఘట్టం.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

    Karnataka new government : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన...

    CM KCR : సీఎం కేసీఆర్ కు కర్ణాటక నుంచి పిలుపు రాలేదా..?

    సీఎం ప్రమాణ స్వీకారానికి అందని ఆహ్వానం CM KCR : కర్ణాటక...