Liquor case : ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సరైన ఆధారాలు చూపలేకపోయింది. దీంతో కేసు ముందుకు వెళ్లడం లేదు. ఈడీ ఆరోపించిన వాటిలో ఒక్క ఆధారం కూడా ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పేరుతో హడావిడి చేసినా చివరకు సాక్ష్యాలు చూపలేకపోయింది. కేసులో ఎలాంటి కీలక ఆధారాలు లేకపోవడంతో ఇక కేసు ముగిసినట్లే అని చెబుతున్నారు.
రూ. వంద కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపించినా ప్రాథమిక ఆధారాలు చూపలేకపోయారు. హవాలా మార్గం ద్వారా డబ్బులు చేతులు మారినట్లు చెబుతున్నా వాటిని రుజువు చేసే ఎలాంటి ఆధారాలు సంపాదించలేదు. దీంతో లావాదేవీలకు సంబంధించి హవాలా ఆపరేటర్ నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు చూపించలేదు. కోర్టుకు ఎలాంటి రికార్డులు అందలేదు.
వ్యాపార వేత్తలైన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలపై ఈడీ కేసులు నమోదు చేసినా వారిని ముద్దాయిలుగా చూపలేకపోయింది. కేసులో బలమైన ఆధారాలు లేకపోవడంతో వారికి జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగించింది
కేసులో అమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఉందని చేసిన ఆరోపణలకు రుజువులు చూపలేదు. మనీలాండరింగ్ లో లభించిన డబ్బులతో గోవా ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పినా ఎక్కడ కూడా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. సీబీఐ దర్యాప్తు చేసినా అందులో ఎలాంటి పసలేదని తెలిసింది. ఇక ఈ కేసు ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు. ఈడీ చేసిన దర్యాప్తు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు.