
AP CMO : ఏపీ సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుతవ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ప్రభుత్వం మారుతోంది. ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ లోపుగానే ఏపీ సీఎంవోను ప్రక్షాళన చేస్తున్నారు.
ఇప్పటికే కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించగా, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.