
Union Budget 2025 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో దఫా ఎన్డీయే ప్రభుత్వంలో తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు ప్రసిద్ధ పద్యం “దేశమంటే మట్టి కాదోయ్” తో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే, ఆర్థిక మంత్రి విపక్షాల గైర్హాజరీ మధ్యనే బడ్జెట్ను కొనసాగించారు.
-ధరలపై ప్రభావం
పన్ను మినహాయింపులు, ఎగుమతులు, దిగుమతులపై సుంక మార్పుల కారణంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గగా, మరికొన్నివి పెరుగనున్నాయి.
– ధరలు తగ్గనున్న వస్తువులు
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్
వెట్ బ్లూ లెదర్
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
12 కీలక ఖనిజాలు
ఓపెన్ సెల్
LCD, LED టీవీలు
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
తోలు ఉత్పత్తులు
వైద్య పరికరాలు
– ధరలు పెరుగనున్న వస్తువులు..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు
సిగరెట్లు
ఈ మార్పులు వినియోగదారులకు, వ్యాపార రంగానికి ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.






