
Schools reopen in AP : ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల ప్రారంభం తర్వాత ఒక్కో విద్యార్ధికి 2500 రూపాయల విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈనెల 12న జగనన్న కిట్స్ తో పాటు పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక ప్రారంభం అవుతుందన్నారు.
ఇక ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి.. 17న జిల్లా స్థాయి.. 15న నియోజకవర్గ స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి ‘ఆణిముత్యాలు’ పేరిట ప్రోత్సాహకాలు అందించనున్నట్టు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 28న అమ్మ ఒడిని నగదును సీఎం జగన్ విడుదల చేస్తారన్నారు. తొలి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ను జూన్ 12న ప్రారంభించనున్నట్లు తెలిపారు.






