Relationship : ప్రేమ గుడ్డిది అంటారు. పడుచు మహిళ కూడా అలానే భావించింది. తనకు సుఖపెట్టేది పురుషుడు అయితే చాలనుకుంది. అందుకే కాటికి కాలుచాపిన వాడిని కూడా సరేనన్నది.. భర్త బతుకుదెరువు కోసం వెళితే 28 ఏండ్ల వివాహిత ఒక ముసోలిడికి పడ్డ సంఘటన వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ భదోహి జిల్లా బీహరోజ్పుర్కు చెందిన అషర్ఫీ దేవి(28) కొన్నేళ్ల క్రితం కృష్ణమూరత్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఉపాధి నిమిత్తం కృష్ణ తమిళనాడు వెళ్లాడు. అషర్ఫీ దేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి సొంతూర్లోనే ఉంటుంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రామ్ యాదవ్(60) తో దేవీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే ఇద్దరూ పారిపోయారు. మూరత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాను సంపాదించి భార్య బిడ్డలను సుఖపెట్టాలని తమిళనాడుకు వెళ్లాలని.. కానీ తన కాపురమే ఇలా కుప్ప కూలుతుందని ఊహించలేదని ఆ భర్త కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. 28 ఏళ్ల తన భార్య 60 ఏళ్ల ముసలోడితో ఎలా వెళ్లిపోయిందో అర్థం కావడం లేదని బోరుమన్నాడు.