
అయితే ఈ విషయాన్ని పెద్దగా అధికారులు పట్టించుకోకపోవడంతో..ఈ బ్రిడ్జ్ పై నుంచి బుధవారం అధిక లోడ్ తో వెళ్లిన లారీ వల్ల వంతెన పూర్తిగా కూలిపోయింది. వంతెనపైకి లారీ రాగానే చాన్నాళ్లుగా బలహీనంగా ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కూప్పకూలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అటుగా పెద్దగా వాహనాల రాకపోకలేం లేవు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఇక బహుదా నది ప్రతీ ఏటా వర్షకాలం చాలా ఉదృతంగా ప్రవహిస్తుంటుంది. ఈనదికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం వంతెన ఎండకాలంలో కూలిపోవడంతో పెద్దగా ప్రమాదమేం జరగలేదు. బ్రిడ్జ్పై వెళుతున్న లారీ ఒక్కటే అందులో పడిపోయింది. అది కూడా వంతెనకు సంబంధించిన రెండు పిల్లర్లు మాత్రమే కూలిపోయాయి. రెండు,నాలుగో పిల్లర్లు మాత్రమే కూప్పకూలాయి.
అంతేకాక లారీ నదిలో పడిన టైంలో వంతెన,నదికి మధ్య ఎత్తు కేవలం 20 మీటర్లు మాత్రమే ఉంది. దీంతో లారీ కూడా ఎక్కువగా డ్యామేజ్ కాలేదు. నదిలో వరదలు కూడా లేకపోవడంతో వాహనం కూడా కొట్టుకుపోలేదు. ఇక వంతెన కూలిన సంఘటనపై మాత్రం స్థానికులు మండిపడుతున్నారు. సకాలంలో వంతెన నాణ్యతను గుర్తించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవే కావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






