22.8 C
India
Sunday, August 9, 2026
More

    A Couple : కలిసి బతకలేకనా..? ఒకే గదిలో.. మిగతజీవులుగా పడి ఉన్న జంట..

    Date:

    A couple sucide
    A couple sucide

    A couple : ఒకే ఊరికి చెందిన ఇద్దరు దగ్గరి బంధువులు ఒక్కటి కావాలని ప్రేమించుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఒకే గదిలో ఇద్దరు వేర్వేరు పద్ధతుల్లో  సూసైడ్ చేసుకున్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ఏడో ఫేజ్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, వారిద్దరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే..

    భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన ఆకుల శ్యాం (24), పోతుల జ్యోతి (22) బంధువులు. బంధుత్వం, మనసులు కూడా కలవడంతో ప్రేమించుకున్నారు. శ్యాం బైబిల్ బోధనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే జ్యోతి గత నెల 26వ తేదీ కూకట్ పల్లికి వచ్చి ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది. అయితే జ్యోతికి గతంలో వివాహం కావడంతో భర్త వేధింపులకు గురిచేయడంతో డైవర్స్ తీసుకుంది. నగరానికి వచ్చి ఉద్యోగం చేసుకుంటుంది.

    వారి ఊరికే చెందిన కృష్ణ ఏల్ఐజీ-8లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. తన బంధువుల పెళ్లి 20వ తేదీ ఉండడంతో 9వ తేదీనే కృష్ణ ఊరికి వెళ్లాడు. అతనితో పాటు అతని గదిలో ఉంటున్న స్నేహితుడు కూడా ఊరెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తన గది తాళం చెవులు కావాలని శ్యాం కృష్ణకు ఫోన్ చేసి అడిగాడు. తాళం చెవులు ఉన్న అడ్రస్ చెప్పాడు కృష్ణ. దీంతో ఈ నెల 12వ తేదీన జ్యోతిని తీసుకొని ఆ గదికి వెళ్లాడు శ్యాం. అయితే వీరిద్దరూ చాలా సార్లు ఇలాగే వస్తుంటారని స్థానికులు కూడా పోలీసులకు తెలిపారు.

    జ్యోతి కోసం ఆమె స్నేహితులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. అయితే సోమవారం కృష్ణ గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి చూడగా జ్యోతి కింద అచేతనంగా పడి ఉంది. పక్కనే శ్యాం ఊరేసుకుని కనిపించాడు. వారి ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా గది ఓనర్ కృష్ణ, జ్యోతి బంధువులు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు.

    గదిలో స్లీపింగ్ పిల్స్ కు సంబంధించి స్ట్రిప్ కూడా కనిపించడంతో బహూషా జ్యోతి నిద్రమాత్రలు వేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారా..? లేక ఇద్దరి మధ్యా ఏదైనా వివాదం తలెత్తడంతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ పోర్టం కోసం ఉస్మానియాకు తరలించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...