
సరిగ్గా ఇలాంటి సంఘటనే యూపీలో చోటు చేసుకుంది. భర్త కాకుండా కోడలు మరో ఇద్దరు వ్యక్తులతో అసహజ స్థితిలో ఉండడాన్ని గమనించి ఆ ముగ్గురుని అత్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. గదికి తాళం వేసి పోలీసులకు కాల్ చేసింది. అయితే పోలీసులు అక్కడికి రావడంతో అసలు విషయం బయట పడింది. యూపీ మహారాజ్గంజ్ జిల్లా నిచ్లాల్ పీఎస్ లిమిట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిచ్లాల్లో నివాసముండే ఓ వ్యక్తికి తన పక్క గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది.
అయితే సదరు వ్యక్తి పెళ్లైన కొద్ది రోజులకే ఉపాధీ కోసం గల్ఫ్ వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే అలుసుగా తీసుకున్న ఆమె ఏదో కారణం చెబుతూ..తరచు పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఈ సందర్భంగా అక్కడే ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధంకు దారి తీసింది. అయితే తరచు పుట్టింటికి వెళ్లడం కుదరదు కనుక..వారిద్దరిని తమ బంధువులుగా పరిచయం చేస్తూ..అత్త వారింటికి రప్పించుకునేది.
ఇక అలా అత్తరింటికి వచ్చిన వారిపై అత్తకు అనుమానం కల్గింది. దీంతో చాలా రోజులుగా వారిపై ఆమె నిఘా పెట్టింది. ఇటీవల మరోసారి ఈ ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చిన సందర్భంగా అసలు విషయమేంటని నిశితంగా పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే అత్త తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తుల తో అసభ్య పరిస్థితులతో ఉండడాన్ని గమనించింది. దీంతో రంకు కోడలను పట్టించాలని భావించిన అత్త ఆ గదికి వెంటనే తాళం వేసింది. కోడలు రంకు వ్యవహారాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో సంఘటన స్థలానికి వెంటనే వచ్చిన పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. కోడలు చాన్నాళ్లుగా వారితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది.






