25.9 C
India
Monday, December 15, 2025
More

    భార్య మరణించిన చోటే తన మరణం.. పైగా పెళ్లిరోజే ఘటన

    Date:

    death happened
    death happened

    Death Happened : హిందూ వివాహ వ్యవస్థలో భార్యా, భర్తల బంధం అతి పవిత్రమైనది. ఎలాంటి రక్త సంబంధం లేకుండా ఒక్కటైన జంట ఒంట్లో శ్వాస ఉన్నంత వరకూ కలిసే ఉంటారు. ఇప్పటి పరిస్థితులు వేరు అది పక్కన ఉంచితే..  ఏడేడు జన్మలకు ఆయనే తనకు భర్తగా, ఆమెనే తనకు భార్య కోరుకుంటారు. ఇంతటి గొప్ప వివాహ వ్యవస్థలో భార్య ఇంటిని చక్క పెడుతుంటే భర్త కుటుంబ భారం మోస్తుంటాడు. అయినా ఇద్దరూ కష్ట సుఖాలను కలిసే పంచుకుంటారు. తల్లి దండ్రులు, అత్తా మామలు ఇరు  కుంటుంబాలు కూడా బంధుత్వం కలుపుకొని ఆజన్మాంతం ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. ఇదంతా కలిసి ఉన్న వారి గురించి చెప్పుకున్నాం కానీ జంటలో ఒకరు చనిపోతే వారి జ్ఞాపకాలు మోయలేక బరువెక్కిన మరొకరు సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక ఘటన ఇక్కడ చూద్దాం.

    వారికి వివాహమై నాలుగు నెలలే అయ్యింది. ఇద్దరి మధ్యా మంచి బంధం ఏర్పడింది. అయితే కారణం తెలియదు గానీ నాలుగు నెలలకు ఆమె ఉరేసుకొని మరణించింది. సరిగ్గా సంవత్సరానికి ఆమె భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ లో జరిగిన ఘటనపై ఎస్ఐ వివరాలు తెలిపాడు.. కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, నేదునూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్ (35) కళాకారుడు. హుస్నాబాద్ లోని గోదాంగడ్డ కాలనీకి చెందిన శారదను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగు నెలలు దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన శారద 20 సెప్టెంబర్, 2022 రోజున తల్లిగారింటి వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించింది. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు శ్యాంసుందర్ పై కేసు కూడా నమోదు చేశారు.

    శారద చనిపోయినప్పటి నుంచి శ్యాం సుందర్ చాలా డీప్రెషన్ లోకి వెళ్లాడు. నాలుగు నెలలే కలిసి ఉన్నా తన భార్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకున్నానని వాపోయేవాడు. తన స్నేహితుల వద్ద కూడా తన భార్య గురించే మాట్లాడేవాడు. దీంతో సరిగ్గా ఏడాది తర్వాత వారి పెళ్లిరోజు మే 15న (మే 14 అర్ధరాత్రి) హుస్నాబాద్ లోని అత్తింటి ఎదుట ఉన్న చెట్టు (తన భార్య ఉరేసుకున్న) వద్ద పురుగుల మందు తాగి మరణించాడు. దీంతో అందరూ వారి బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కొన్నిరోజులు కలిసి ఉన్నా జీవితకాలం బంధం ఏర్పడిందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pregnant : మొగుడు చనిపోయిన 11 ఏళ్లకు గర్భవతి అయిన మహిళ

    Pregnant : యూపీలోని ఓ మహిళ మొగుడు చనిపోయిన 11 ఏళ్లకు...