37.3 C
India
Sunday, June 7, 2026
More

    Robbed : తోడు కోసం అద్దెకిస్తే.. హత్య చేసి దోచుకెళ్లింది..

    Date:

    robbed
    robbed

    Robbed: భర్త మరణించడం ఉన్న ఇద్దరు కొడుకులు వృత్తి రిత్యా వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలింది ఆ తల్లి. ఒంటరి తనం నుంచి బయట పడేందుకు.. ఇంటి వద్ద ఇంత సాయంగా ఉంటుందని ఒక వ్యక్తికి ఇంటిలోని ఒక పోర్షన్ ను ఒక మహిళకు అద్దెకు ఇచ్చింది. ఆమె ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి ఇద్దరూ కలిసి వృద్ధురాలిని హత్యచేసి ఆమె నగలను దోచుకెళ్లారు. ఈ ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వివరించారు.

    తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ కు చెందిన సంరెడ్డి సత్తెమ్మ (82)-స్వామిరెడ్డి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో నివసించే వారు. స్వామి రెడ్డి చాలా కాలం క్రితం కాలం చేశారు. ఇక ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు బాల్ రెడ్డి వనస్థలిపురంలో, చిన్నవాడు గోపాల్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక పెద్ద కూతురును వనస్థలిపురంకు, రెండో కూతురును బొల్లారంకు ఇచ్చింది. బంధువుల వివాహం నిమిత్తం చిన్న కూతురు వద్ద ఎనిమిది రోజులు ఉంది. ఆ తర్వాత పెద్ద కూతురు ఇంటికి వెళ్లి ఆదివారం తన ఇంటికి వచ్చింది.

    ఆదివారం సాయంత్రం వరకు ఇరుగు పొరుగు వారితో ముచ్చటించింది సత్తెమ్మ. సోమవారం ఇరుగు పొరుగు వారు వచ్చి తలపుతట్టగా స్పందించలేదు. దీంతో పక్కన ఉన్న ఒక తలపును తొలగించి లోపలికి వెళ్లి చూడగా విగత జీవితగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ సాయిశ్రీ పరిసరాలను పరిశీలించారు. ఇరుగు పొరుగును విచారించగా వృద్ధురాలి ఇంట్లో మరో గదిలో ఉన్న లలిత గురించి చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

    నారాయన్ పేట జిల్లా, దామరగిద్దకు చెందిన ఎడ్ల రాకేశ్ ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఆయన అన్న తొర్రూరులోని సత్తెమ్మ ఇంటి ఎదుట ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణ పనులను చూసుకునేందుకు రాకేశ్ అప్పుడప్పుడూ వచ్చేవాడు. ఈ నేపథ్యలో లలిత, రాకేశ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వచ్చినప్పుడల్లా సత్తెమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేశాడు రాకేశ్. ఆమెను హత్య చేసి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నాడు. హత్య పథకం లలితకు వివరించాడు. ఇద్దరూ ఆదివారం రాత్రి సత్తెమ్మ గదిలోకి చొరబడ్డారు. లలిత కాళ్లు పట్టుకోగా రాకేశ్ గొంతునులిమి హత్య చేశాడు. ఒంటిపై బంగారం తీసుకొని పరారయ్యారు. సోమవారం ఎలాంటి అనుమానం రాకుండా గుంపులో కలిసిపోయారు. పోలీసులు వీరిని రిమాండ్ కు పంపి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Betting : బెట్టింగ్ యాప్స్: వెయ్యి మంది ప్రాణాలు బలి!

    Betting : తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ విషాదం నింపుతున్నాయి. గడిచిన ఏడాది...

    baldness : బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

    baldness : కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే...