Pad lock-Graveకొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ దేశంలోని సమాధుల్లోని అమ్మాయిల శవాలు మాయమవుతున్నాయని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసింది. అలా మాయమైన శవాలను దుండగులు రేప్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై రచ్చ అయింది. ఇప్పటికే ఆర్థికంగా దిగజారి పోయిన పాక్లోని పబ్లిక్ ఈ స్థాయికి దిగజారిపోయారా..? అని పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఇదేక్కడి దిక్కుమాలిన చర్యలంటూ పలువురు మండి పడ్డారు కూడా.
అయితే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. సమాధుల్లోని శవాలు మాయమవుతున్నట్లు, సమాధులకు తాళాలు వేస్తున్నట్లు చెబుతున్న వీడియోలు పాకిస్థాన్లోనివి కావంటా..! అవి మన హైదరాబాద్లోనివేనంటా..! హైదరాబాద్ మాదన్నపేటలో ముస్లింలకు సంబంధించిన ఖబరిస్తాన్ ఉంది. అక్కడే పలువురు ముస్లింలు తమ తాత,ముత్తాతల నుంచి వారి చనిపోయిన తర్వాత ఇస్లాం సంప్రదాయాల ప్రకారం సమాధులను కట్టిస్తున్నారు.
అయితే చాన్నాళ్ల క్రితం తమ ముందు తరాల వారిని పాతి పెట్టిన సమాధుల్లో వారి గుర్తులు ఉన్నాయో…? లేవో..? చూసుకునేందుకు మాదన్నపేటలోని కొందరు ముస్లింలు ఉత్సుకతను చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారి వంశస్థులకు సంబంధించిన సమాధులను త్రవ్వి తీసి చూసుకుంటున్నారు. అయితే అలా తీసిన సందర్భంలో శవాలు మాయం కాకుండా ఉండేందుకు వాటికి తాళాలు వేయిస్తున్నారు. ఇక విషయం తెలియక కొందరు ఈ వ్యవహారం పాకిస్థాన్ కు సంబంధించిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు కేవలం హైదరాబాద్ మాదన్నపేటకు సంబంధించినవిగా మాత్రమే స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో సమాధుల్లోని ఎలాంటి శవాలు కూడా మాయం కాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫుకార్లను పబ్లిక్ నమొద్దని అంటున్నారు.