
వచ్చే యేడాది జరుగునున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గట్టిషాక్ తగులుతుందని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పోటి చేస్తే 150 Seats లో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.
ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై విరుచుకుపడిన గోనే ప్రకాష్ రావు బాలినేనికి రాజకీయ భిక్ష పెట్టింది వైవీ సుబ్బారెడ్డేనని గోనే ప్రకాష్ రావు అన్నారు. మరోమారు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై కూడా మాట్లాడారు. జగన్ పరిపాలనకు, రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు.
తాను ఇంతకు మాటాలను వక్రీకరించారన్నారు. అవినీతి చేసిన వారి పేర్లను మాత్రమే చెప్పానన్నారు. జగన్ అవినీతిపై జరిమాన పడుతుందని మాత్రమే చెప్పానన్నారు. బారతి జైలుకు వెళ్తుందని తాను అనలేదని చెప్పారు. తనను విమర్శించాడని బాలినేని అంటున్నాడని నేను బాలినేనిపై ఎటువంటి విమర్శలు చేయలేదని, ఆయనను ఎప్పుడు కించపరచలేదని ఆయన రాజకీయ ఎదుగుదలకు కారణం ఎవరో మాత్రమే చెప్పానన్నారు.
సొంత బాబాయ్ వివేకానందరెడ్డి ని చంపితేనే దిక్కులేదని, నిందుతులను రక్షించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాబో యే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టిస్తాయని, ఒక వేళ టీడీపీ ఓంటరిగా పోటి చేసినా వంద సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఏ రకంగా చూసినా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పేలా లేదన్నారు. భారతి కోసమే చెల్లెలు షర్మిలను, విజయమ్మను దూరం పెడుతున్నారని వ్యాఖ్యానించారు.






