
the night : ‘ఆడది అర్థరాత్రి స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు జాతిపిత మహాత్మాగాంధీ. ఆడవాళ్లు రాత్రి ఒంటరిగా కాదు.. ఇప్పుడు మగవారే ఒంటరిగా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు చంపుతారో.. ఎవరు కొడతారో.. తన వద్ద ఉన్న వాటిని ఎత్తు కెళ్తారో అని భయపడుతున్నారు. ఇక ఆడవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీరిపై లైంగికదాడులు, కిడ్నాపులు, కొనసాగుతూనే ఉన్నాయి. పగలే ఇవన్నీ జరుగుతున్నా.. ఇక రాత్రి వేళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.
ఒక మీడియా సంస్థ ఎక్స్పర్మెంట్ చేసింది. ఆడపిల్లను అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డుపై ఉంచితే ప్రజల రాయాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా ఒక యువతి నగరంలోని ఓ బిజీ రోడ్డు పక్క నిలబెట్టింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా..
1. మొదట ఓ బ్లూ కారు ఆమె చుట్టూ రౌండ్లు కొట్టింది. కారు ఆపి డబ్బులు చూపించడం మొదలు పెట్టాడు కారులోని వ్యక్తి.
2. కొద్దిసేపటి తర్వాత బైకుపై వచ్చిన వ్యక్తి లిఫ్ట్ కావాలా అని అడిగాడు.
3. బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను చూడగానే ఆపారు. బైకుపై నుంచే సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టారు. అమ్మాయి స్పందించకపోవడంతో వెళ్లిపోయారు.
4. బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘మేడమ్ అంతా బాగానే ఉందిగా’ అంటూ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఏమీ సమస్యలేదని యువతి చెప్పడంతో వెళ్లిపోయారు.
5. ఓ వ్యక్తి బైకుపై ఆమె దగ్గరకి వచ్చాడు. ‘మేడమ్ నేను ప్రభుత్వ ఉద్యోగిని.. ఏదైనా సమస్యా? నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. నా దగ్గర ఐడీ కార్డు కూడా ఉంది. రండి వెళ్తాం లేదంటే వెహికల్ బుక్ చేస్తాను వెళ్లిపోండి. ఇది మంచి ప్లేస్ కాదు’ అని మంచి మాటలు చెప్పాడు. ఆమె వద్దనటంతో వెళ్లిపోయాడు.
6. వైట్ కారులో వచ్చిన వ్యక్తి రూ. 2000 ఇస్తా బండి ఎక్కు అన్నాడు.
ఈ ఎక్స్పర్మెంట్ లో కొందరు మంచిగా స్పందిస్తే.. మరికొందరు చెడుగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.






