
వైఎస్ జగన్ 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అనీ చెప్పుకుంటున్న సీఎం జగన్ అందుకు తగ్గట్లు గానే తన ప్రణాళికలు రూపొందించుకుంతున్నారు. అందుకోసం జగన్ ఫోటోకూడిన స్టిక్కర్లను ఇంటికి వెళ్లి అంటించారు.. ఆ తరువాతజగనన్నే మా భవిష్యత్తు అనీ ప్రోగ్రాం చేపట్టారు… ఎ ప్రోగ్రాం కు విశేష స్పందన వచ్చింది… కోటి 16 లక్షల మంది మద్దతు ప్రకటించారు.
తనకు మద్దతుగా నిలిచిన వముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు చెప్పారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మెగా సర్వే లో కోటి 45 లక్షల కుటుంబాల నుంచి ప్రభుత్వ పాలన పైన అభిప్రాయ సేకరణ చేసారు. అందులో వచ్చిన స్పందన పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు వైఎస్సార్సీపీ భారీ కార్యక్రమం నిర్వహించింది. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో 29వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో మొత్తం 1.60 లక్షల కుటుంబాలను కలవాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో పాటుగా వార్డు కో ఆర్డినేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలలు, మంచి గురించి వివరించారు. గత పాలన..ప్రస్తుత పాలన గురించి వివరిస్తూ కరపత్రాలు అందించారు. ఇదే సమయంలో పాలన పైన పబ్లిక్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అందులో భాగంగా కోటి 16 లక్షల కుటుంబాలు జగన్ కు మద్దతు ప్రకటించాయి. మెగా పల్స్ సర్వే ఫలితాలను వైసీపీ నేతలు వెల్లడించారు.
తమ పాలన పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్ చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన వైసీపీ పార్టీ క్యాడర్ కు ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు చెప్పారు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేసారు. మెగా సర్వే ఫలితాలతో వైయస్ఆర్సీపీ క్యాడర్ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా పాలనా పరంగా ఎన్నికల సమయంలోగా అవసరమైన నిర్ణయాల దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.






