
AP Prakasam District : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం 40 వేల ఏళ్లనాటి పక్షిగూడును కనుగొన్నారు. వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ గూడును కనుగొంది. జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్ దేశాలకు చెందిన సైంటిస్టులతో కలిసి ప్రకాశం జిల్లాలో పరిశోధనలు చేశారు. వారికి కనిపించిన గూడు 41 వేల ఏళ్ల నాటి నిప్పుకోడి పక్షిగూడు అని కనుగొన్నారు.
40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు ఎందుకు అంతరించిపోయాయని చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ పక్షి గూడుని వారు కనుగొన్నారు. ప్రకాశం జిల్లాలోని గూడులో 9 నుంచి 11 గుడ్ల వరకు ఉండేవని వారు అనుకుంటున్నారు. వీటి గుడ్లు ఒక్కటి 10 అడుగుల వెడల్పు ఉంటుందట. గతంలో కూడా దక్షిణ భారతదేశంలో 3 వేల 500 నిప్పు కోడి గుడ్ల పెంకులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.