
5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్ వేలంలో తొలిరోజు బిడ్ల ప్రక్రియ ముగిసే సమయానికి టెలికాం కంపెనీలు రూ.11,000 కోట్ల విలువ గల బిడ్లు దాఖలు చేశాయి. ఈ విడతలో ప్రభుత్వం రూ.96,238 కోట్ల విలువ గల 10,500 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్ ను వేలానికి పెట్టింది. మంగళవారం ప్రధానంగా 900, 1800 మెగా హెడ్జ్ బ్యాండ్లకు అధిక బిడ్లు దాఖలయ్యాయి. బుధవారం ఎలాంటి బిడ్లు లేకపోవడంతో ఉదయం 1.30 గంటలకే వేలం ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొన్నాయి. బుధవారం వేలం ముగిసే సమయానికి కేవలం 140-150 MHz స్పెక్ట్రానికే బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో రూ.11 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. 2022లో చివరిసారిగా నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం ఏడు రోజుల పాటు సాగింది. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ ను టెలికాం కంపెనీలు కొనుగోలు చేశాయి.