
Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఒక అరుదైన వోల్ఫ్డాగ్ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ‘కాడాబాంబ్ ఒకామి’ అనే జాతికి చెందిన ఈ కుక్క కోసం ఆయన ఏకంగా $5.7 మిలియన్లు (దాదాపు రూ.50 కోట్లు) వెచ్చించారు. కుక్కలంటే అమితమైన ప్రేమ ఉండటం వల్లే ఇంత భారీ మొత్తం ఖర్చు చేశానని సతీశ్ తెలిపారు.
అంతేకాకుండా, అరుదైన మరియు ప్రత్యేకమైన జాతుల కుక్కలను భారతదేశానికి పరిచయం చేయాలనేది తన అభిమతమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో పుట్టిన ఈ ఎనిమిది నెలల వయసున్న కుక్క రోజుకు మూడు కిలోల పచ్చి మాంసం తింటుందట.






