Tirupati : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నో ఏళ్లనాటి రావిచెట్టు గాలివానకు నేలకొరిగింది. దీని వల్ల ఓ భక్తుడు చనిపోయాడు. ఇంకా ముగ్గురికి గాయాలయ్యాయి. ఎంతో మంది భక్తులకు సేద తీరేందుకు వీలుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా నేలకొరగడగం గమనార్హం.
ఎన్నో ఏళ్ల చెట్టు ఒకే గాలివానకు కూలినట్లు ఎన్నో తరాలు చూసిన అది కుప్పకూలడంతో అందరు ఆశ్చర్యపోయారు. గాలివానలకు పెద్ద పెద్ద చెట్లు కూడా నేలకూలుతాయి. అలాంటి రావిచెట్టు కూలిపోవడంతో కడపకు చెందిన రిమ్స్ విశ్రాంత ఉద్యోగి డాక్టర్ రాయదుర్గం గుర్రప్ప (72) తలకు గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
అతడి కుమార్తె శ్రీ రవళి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. ఆమెను చూడటానికి వచ్చిన తండ్రి కుమార్తెతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. మొత్తానికి పెద్ద చెట్టు నేల రాలడంతో నీడ లేకుడా పోయింది. ఈ సంవత్సరం గాలి విపరీతంగా పెడుతోంది. దీని వల్ల ఎన్నో చెట్లు కూలిపోతున్నాయి.
తిరుపతిలో చెట్టు కూలిన సంఘటన అందరిలో అనుమానం కలిగిస్తోంది. ఇదో అపచారంగా భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో చెట్టు కూలడం ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఘటన సమయంలో గుడిలో ఉన్న ఏనుగులు సైతం ఘీంకారం చేయడంతో సిబ్బంది అదుపు చేశారు.