37.5 C
India
Thursday, April 25, 2024
More

    మ‌నుషులు కాదు.. మృగాళ్లు.. !

    Date:

    వివాహిత‌పై ఐదుగురు వ్య‌క్తుల గ్యాంగ్ రేప్..

    మొన్న ఈ మ‌ధ్య హ‌న్మ‌కొండ క్రాస్ రోడ్డు వ‌ద్ద ఓ అమ్మాయిని న‌మ్మించి ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు భీమారం ప్రాంతంలో గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పెద్ద ప్ర‌కంప‌న‌లే సృష్టించింది. పెద్ద ఎత్తున పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌,ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

    అయితే ఈసంఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే..తాజాగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వివాహిత‌పై మ‌రో ఐదుగురు మృగాళ్ల‌ గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పైడిప‌ల్లికి చెందిన ఓ మ‌హిళ స్థానికంగా ఓ క‌ర్రీస్‌పాయింట్‌లో ప‌నిచేస్తున్నారు. ఆమెకు కొన్నాళ్ల క్రిత‌మే వివాహం జ‌రిగింది. ఈనేప‌థ్యం లోనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంద‌ని ఆమె క‌ర్రీస్ పాయింట్‌లో వ‌ర్క్ చేస్తున్నారు.

    ఇక గ‌త నెల 20న క‌ర్రీస్‌పాయింట్ వ‌ద్ద ప‌నిచేసుకుంటున్న ఆమెకు త‌న స్నేహితురాలు ఫోన్ చేసి ఆరెప‌ల్లికి రావాల‌ని సూచించ‌గా..స‌ద‌రు మ‌హిళ‌ను ఆమె భ‌ర్త బైక్‌పై తీసుకొచ్చి వ‌దిలివెళ్లారు. ఈనేప‌థ్యం లోనే అక్క‌డికి కారులో వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను అందులో ఎక్కించుకొని ములుగు జిల్లా వైపు తీసుకెళ్లారు. ఇక క‌రీస్‌పాయింట్ లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌కు ఫోన్ చేసిన మ‌హిళ‌ ములుగు జిల్లా స‌రిహ‌ద్దుల్లో దిగిపోయారు.

    క‌రీస్‌పాయింట్‌లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌ మాత్రం కారులోనే ఉండిపోయింది. ఈ నేప‌థ్యంలో మొద‌ట‌గా కారులో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు తోడు మ‌రో ముగ్గురు వ్య‌క్తులు ములుగు జిల్లా స‌రిహ‌ద్దులోనే వెహికిల్ లోకి ఎక్కారు. ఈ సంద‌ర్భంగా వెంట‌నే కారు ఉన్న క‌రీస్‌పాయింట్‌లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌కు మ‌త్తు ఇంజెక్ష‌న్ ఇచ్చి మేడారం అడ‌వుల్లోకి తీసుకెళ్లి రేప్ చేశారు. ఆ త‌ర్వాత ఆమెను బ‌స్సు ఎక్కించి హ‌న్మ‌కొండ‌కు పంపించారు. దీంతో ఆమెను ఇంత‌సేపు ఎక్క‌డికి పోయావ‌ని భ‌ర్త మంద‌లించ‌గా..స‌మాధానం ఇవ్వ‌కుండా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత అస‌లు విష‌యాన్ని తెలుసుకున్న ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో ఆమెను అత్యాచారం చేసిన ఐదుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    TDP-YCP : నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత – తిరుపతిలో యుద్ధం చేసిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ...

    Viral News : నామినేషన్ వేసేందుకు వచ్చిన ‘విడదల రజిని’ కిడ్నాప్..?

    Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Married Woman : సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకో తెలుసా?

    Married Woman : ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసిం...

    Kakatiya Sculptures : కాకతీయ శిల్పాలకు ప్రాణం.. నేడు ప్రారంభం

    Kakatiya Sculptures : వరంగల్ వేయిస్తంభాల గుడిలో నీ కళ్యాణ మండపం...

    Groom Stuck In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వరుడు.. క్లియర్ చేసిన పోలీసులు

    Groom Stuck In Traffic : పెళ్లంటే నూరేళ్ల పంట.. పండితులు పెట్టిన...

    Warangal East Constituency Review : నియోజకవర్గం రివ్యూ : వరంగల్ ఈస్ట్ లో గెలుపు ఎవరిది?

    గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే  అసెంబ్లీ నియోజకవర్గం : వరంగల్ ఈస్ట్(పశ్చిమ) బీఆర్ఎస్ :...