
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పకడ్బందీ చర్యలకు సంకల్పించింది. ఇందులో భాగంగానే హెల్మెట్ల ప్రస్తావన తెస్తోంది. వాహనం నడిపే వారే కాకుండా వెనుక కూర్చున్న వారు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పూనుకుంది. అధికారులు సరికొత్త ప్రతిపాదనలు ప్రతిపాదించేందుకు సిద్ధపడుతోంది.
ఇక మీదట కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి Double Helmets ఇవ్వాలని చూస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త ప్రతిపాదన గురించి ఆలోచిస్తోంది. ఇంకా ఈ నిబంధన అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వ అనుమతితో ఈ నిబంధన అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఈ నిబంధన అమలు కానుందని చెబుతున్నారు.
ప్రయాణికుల భద్రత కోసం ఈ నిబంధన అమలు చేయాలని ప్రణాళికలు తయారు చేసింది. వెనుక కూర్చున్న వారికి కూడా ప్రాణాపాయం ఉండొద్దని అంటోంది. చాలా ప్రమాదాల్లో వెనుక కూర్చున్న వారు సైతం తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని భావిస్తోంది. దీని కోసమే కొత్త నిబంధన అమలు చేయాలని రూపకల్పన చేస్తోంది.
ఈ మేరకు ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తే ప్రయాణికుల భద్రతకు గ్యారంటీ ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకున్నా వారు గాయాలతో బయటపడొచ్చు. కానీ ప్రాణాలు మాత్రం పోయే అవకాశం ఉండదు. దీంతోనే కొత్త రూల్ తీసుకొచ్చి double helmets తీసుకోవాలనే కొత్త తరహా ఆలోచన అమలు జరిగితే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.






