
America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిస్సోరి స్టేట్ లో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. శ్యాండిల్ ఎస్ టౌన్ లో ఈత కొట్టేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లోకి దిగిన కిరణ్ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. గత ఏడాది నవంబర్ లో అమెరికా వెళ్లిన కిరణ్ శ్యాండిల్ టౌన్ లో ఎంఎస్ చదువుతున్నాడు.
కిరణ్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా అతడి తాత మనవడి కోరికను కాదనలేక ఒక ఎకరం పొలం అమ్మి మరీ ఎంఎస్ చదివేందుకు అమెరికా పంపాడు. ఎంఎస్ చదివి వస్తాడని ఆశించిన ఆ కుటుంబంలో కిరణ్ మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. కిరణ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అతడి స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.