Kuwait : కువైట్ ఎడారిలో ప్రవాస భారతీయుడు పడుతున్న వేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతదేశంలోని కొంతమంది యువకులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో కొందరు యువకులు వారిని తీసుకెళ్లిన ఏజెంట్లు మోసం చేసి అక్కడే వదిలేస్తున్నారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. కువైట్లో మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏజెంట్ తీసుకొచ్చి మోసం చేశాడని, తాను చెప్పిన పని ఒకటని, ఇక్కడ చేస్తున్న పని మరొకటి ఉందని తెలుగు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తీసుకొచ్చి ఎడారిలో పడేశారు. ఇక్కడ మాట్లాడేందుకు ఎవరూ లేరని, కూర్చోవడానికి చెట్టు కూడా లేదని, పశువులు, కుక్కలు, బాతులను మేపేందుకు ఇక్కడికి తీసుకొచ్చారని వాపోయాడు.
ఇక్కడ మోటార్లు, జనరేటర్లు పనిచేయక పోయినా యజమానులు పట్టించుకోకపోవడంతో చెట్లకు నీరు పెట్టేందుకు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. తిండి, నీళ్లు సరిగా లేవని వాపోయాడు. ఏజెంట్ కు ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని, అంత డబ్బు తమ వద్ద లేదని.. ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకున్నాడు. మరో రెండు రోజుల్లో ఎవరూ స్పందించకుంటే.. తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని భోరుమన్నారు. అక్కడ పరిస్థితిని వీడియో తీసి ఎవరైనా కాపాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తెలుగువాడి బాధను ఎవరైనా అర్థం చేసుకుని కాపాడేందుకు చొరవ తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో ఏపీ మంత్రి లోకేష్ వద్దకు చేరడంతో ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడి యువకుడిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
We have identified the harassed victim in the video. Our NRI TDP team has reached out to his family. Our Govt will work with @MEAIndia to bring him back to Andhra Pradesh safely. https://t.co/Sa9ormCcgC
— Lokesh Nara (@naralokesh) July 13, 2024