
CPI Ramakrishna : కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇసుక, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు.
అవినీతి, అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఫైళ్ల మాయం ఆందోళనకరమన్నారు. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు.