
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. 71 సంవత్సరాల శరత్ బాబు చెన్నై లోనే స్థిరపడ్డాడు. తెలుగు సినిమా రంగం హైదరాబాద్ కు తరలివచ్చినప్పటికీ శరత్ బాబు మాత్రం చెన్నై లోనే ఉండిపోయాడు. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా విభిన్న పాత్రల్లో నటించాడు శరత్ బాబు.
అయితే ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని ఆశిస్తున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు శరత్ బాబు ఇంటికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు.






