35.7 C
India
Thursday, June 1, 2023
More

    Bandar Port : ముుచ్చటగా మూడో‘సారి’ బందర్ పోర్టు

    Date:

    Bandar Port
    Bandar Port

    Bandar Port : ఏపీలో బందర్ పోర్టు పనులకు ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. మచిలిపట్నం ప్రజల కలగా బందర్ పోర్టును చెబుతారు. అయితే ఈ పోర్టు ఇప్పట్లో పూర్తవుతుందా.. మళ్లీ పాత కథేనా అని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతున్నది..

    ఇంతకీ పాత కథ ఏంటని అనుకుంటున్నారా… అయితే చదివేయండి.. బందర్ పోర్టు పనులను ప్రారంభించడం  ఇది కొత్తేమి కాదు. ముఖ్యమంత్రులు దీనిని ప్రారంభించడం ఇది మూడో సారి. మొదటి సారిగా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరగ్రహరంలో శిలాఫలకం ఆవిష్కరించి బందర్ పోర్టు పనులను ప్రారంభించారు. కాని పనులు ముందుకు సాగలేదు. ఆ 2013లో బందర్ లో ఒక సభలో పాల్గొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బందర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాని దానిని పట్టించుకోలేదు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పేర్నినాని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా కొబ్బరికాయ కొట్టారు. తన పార్టీ ఎంపీకి చెందిన నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆ తర్వాత ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. పనులు జాప్యం చేస్తున్నారనే కారణం చూపి నవయుగ కాంట్రాక్ట్ ను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక పనులు ఆగిపోయాయి. తాజాగా జగన్ మరోసారి ఎన్నికలకు ఏడాది ముందు బందర్ పోర్టు పనులకు సోమవారం మరోసారి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉన్నారు.

     తాము అధికారంలోకి వచ్చాక కరోనా విపత్తు కారణంగా రెండేళ్లు జాప్యం జరిగిందని వైసీపీ చెబుతున్నది. పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా కొంత ఆలస్యమైందని చెబుతోంది. 2024లో మళ్లీ ప్రభుత్వం మారితే కథ మొదటి నుంచి మొదలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పుడైనా మచిలీపట్నం వాసుల కల నెరవేరుతుందా.. లేదా వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan Rule AP : నాలుగేళ్ల జగన్ పాలన.. ..అంతా ఓకేనా..!

    CM Jagan Rule AP : ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్...

    Financial crisis : ఆర్థిక దివాళాతో ఏపీ విలవిల.. సీఎం జగనే కారణమా..?

    Financial crisis : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అప్పులు...

    Time for YCP : 2024 వైసీపీకి గడ్డు కాలమే.. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిందే…

    Time for YCP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు...

    Jagan meet BJP : బీజేపీ పెద్దలతో జగన్ భేటీ.. రాజకీయమా.. వ్యక్తిగతమా..?

    Jagan meet BJP : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్...