
Modi Tourist Pic : భారత ప్రధాని నరేంద్రమోడీ. ప్రపంచం యావత్తు చిరకాలం గుర్తుంచుకునే పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి నాయకుడు. ఎన్నో దేశాలను పలు విధాలుగా ఆదుకున్న మహోన్నత వ్యక్తి. వివిధ దేశాలతో కూడిన ఏ సమావేశమైన ఆయన ప్రత్యేక ప్రసంగం, ఆయన సూచనలు, సలహాలు లేకుండా పూర్తవదంటే మామూలు విషయం కాదు. ఆయన కోట్లాది మంది భారతీయులకే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో పౌరులకు అభిమానే. దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాలోని పౌరులు కూడా ఆయన నామస్మరణ చేస్తున్నారంటే ఇంత కంటే చెప్పుకోవలసింది ఏముంటుంది.
ఇప్పటి వరకు భారతదేశాన్ని ఏలిన ప్రధానుల్లో మేటి అనిపించుకున్నారు మోడీ. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో కెళ్లా 5వ స్థానానికి తీసుకెళ్లిన ఆయన మేకిన్ ఇండియాతో ప్రపంచాన్ని ఇండియా వైపునకు నడిపించాడు. ఈ రోజు చాలా దేశాలు తమ ఉత్పత్తులకు మంచి తయారీ కేంద్రం, మంచి మార్కెట్ అని భారత్ ను పేర్కొంటున్నాయంటే ఆయన తీసుకచ్చిన సంస్కరణలే కారణం అని చెప్పకతప్పదు. ‘మేకిన్ ఇండియా’తో స్వదేశీ ఉత్పత్తులను భారీగా పెంచగలిగారు మోడీ. జీ 20, బ్రిక్స్ ఇలా వివిధ దేశాలతో చెలిమి చేస్తూనే దాయాదులకు కూడా అంతే తీవ్రంగా హెచ్చరికలు పంపుతారు మోడీ. గాల్వాన్ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రధాని చైనా ఉత్పత్తులు, యాప్ లను భారత్ లో నిషేధించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది.

ఇంతటి శక్తి ఆయనకు ఊరికనేరాలేదు. ఎన్నో ఏళ్లు తను నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పని చేశారు మోడీ. అకుంఠిత ధీక్షతో ముందుకు వెళ్తూనే.. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. మోడీ అడుగుపెడితే చాలా దేశాల్లో పొలిటికల్ ఛేంజెస్ అవుతాయి అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రధాని మోడీ ప్రస్తుతం (జూన్ 22) అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతుంది. 27 సంవత్సరాల క్రితం అంటే 1994లో మోడీ వైట్ హౌజ్ ఎదుట ఒక ఫొటో దిగారు. ఆయనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషిలు ఉన్నారు. అప్పుడు టూరిస్ట్ గా వెళ్లిన ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది (గోద్రా అల్లర్లు జరిగిన నేపథ్యంలో). 2014లో మోడీ ప్రధాని అయ్యాక వీసా పునరుద్ధరించింది. ఇప్పటి వరకు మోడీ ప్రధాని హోదాలో చాలా సార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు.