Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల చివరిలో చిత్ర బృందం ఫస్ట్ లుక్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాక, ఈ సినిమాలో విలన్గా ఆది పినిశెట్టి నటిస్తున్నారని సమాచారం. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో కూడా ఆది విలన్గా నటించారు.
మొత్తానికి, ‘అఖండ 2’ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు మహా శివరాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది.