39.4 C
India
Saturday, June 6, 2026
More

    Nitish Kumar – Chandrababu : ఆ ఇద్దరి నేతలపైనే అందరి దృష్టి..

    Date:

    Nitish Kumar - Chandrababu
    Nitish Kumar – Chandrababu

    Nitish Kumar – Chandrababu : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు, ఇండియా అలయన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ చిన్న అవకాశాన్ని జారవిడిచేందుకు సిద్ధంగా లేదు.  బుధవారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశమై మోడీని తమన నేతగా ఎన్నకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఎన్డీఏ నేతలు రాష్ర్టపతిని కలవనున్నారు. ఈ నెల8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు సైతం కొనసాగుతున్నాయి.

    చంద్రబాబు.. నీతీష్ చేరుతారా?
    ఎన్డీఏ సమావేశం అనంతరం ఇద్దరి పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాగా, మరొకరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఫలితాలు వెలువడిన తర్వాత ఇద్దరూ కింగ్‌మేకర్లుగా అవతరించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ వీరిద్దరూ భారత కూటమిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంది. వీరిలో ఆయన పార్టీ అభ్యర్థులు 12 మంది గెలిచారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సైతం 16 సీట్లు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. ఆ పార్టీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీజేపీ తన భాగస్వామ్య పక్షాలతో కలిపి 292 సీట్లు చేరుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సజావుగా నడపాలంటే రెండు కూటములకు నితీష్, చంద్రబాబు నాయుడు మద్దతు చాలా అవసరం.

    ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నీతిష్ కుమార్ ను  కాంగ్రెస్ తో పాటు ఆ కూటమిలోని పార్టీల నేతలు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తాను ప్రధాని పదవికి అర్హుడినని పలుమార్లు ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చారు. దీంతో ఇండియా కూటమిలోని పార్టీలు నితీష్ ను మరింత దూరం పెట్టాయి. ఇది జీర్ణించుకోలని నితీష్ అవమానాన్ని తట్టుకోలేక తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. బీజేపీ సైతం నితీష్ డిమాండ్లకు అంగీకరించింది. ఇక ఇప్పుడు తను కింగ్ మేకర్ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఇండియా కూటమి నితీష్ కు తలవంచుతున్నా దూరంగానే ఉంటున్నాడు. మరి కొన్ని నెలల్లో బిహార్ లో ఎన్నికలు ఉండడం ఒక కారణం. ఆ ఎన్నికల్లో గెలవాలంటే నితీష్ బీజేపీతో ఉండడమే మేలని భావిస్తున్నాడు.

    ఇక చంద్రబాబు సైతం రెండు సార్లు బీజేపీని విభేదించి ఓటమి పాలయ్యాడు. మళ్లీ బీజేపీతో పొత్తు తో చంద్రబాబుకు చాలా కలిసి వచ్చింది.  బంపర్ మెజార్టీతో విజయం సాధించాడు. ఇప్పుడు తనకు దేశ రాజకీయాల కన్నా, రాష్ర్టంలో మళ్లీ పట్టునిలబెట్టుకోవడమే ముఖ్యం. ఎలాగు ఎన్డీఏలో కీలకం కావడంతో ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకొని డెవలప్ చేయడం బాబు ముందున్న ప్రధాన సవాలు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమికి బాబుతో పాటు నితీష్ వెన్నుపోటు పొడవరనే చర్చలు జరగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...

    Chandrababu : బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలక భేటి

    Chandrababu : దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్...